Monday, May 20, 2024

వచ్చే నెల 10న వికారాబాద్‌లో భూముల వేలం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌ఐఐసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణరాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) భూముల వేగాన్ని వేగవంతం చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను వడివడిగా వేలం వేసి అమ్మకాలు సాగిస్తోంది. గత ఆగస్టు నెలలో కామారెడ్డిలోని ధరణి టౌన్‌ షిప్‌లోని ప్లాట్లు వేలం వేయగా తాజాగా వికారాబాద్‌లోని ఓపెన్‌ ప్లాట్లు వేలం వేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 18న ప్లాట్లు వేలం వేయనున్నట్లు తెలిపింది. గజం ప్రారంభ ధరను రూ.10వేలుగా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement