Monday, April 29, 2024

ఢిల్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే కు టీఆర్ఎస్ నేత‌ల నివాళులు

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీ వెళ్లిన నేతలు సోమవారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. పూలే చేసిన సేవలను కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement