Thursday, April 25, 2024

సాయిబాబా సేవలో భట్టి దంపతులు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. సోమవారం బోనకల్లు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు సాయిబాబా, నవదుర్గాదేవి ఆలయాల్లో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement