Sunday, April 28, 2024

Breaking: చెరువులో ఈత‌కు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గ‌ల్లంతు

చెరువులో ఈత‌కు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గ‌ల్లంతైన విషాద ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లం చీర్యాల్ లో చోటుచేసుకుంది. నాట్కాం చెరువులో ఈత‌కు వెళ్లి తీగ‌ల కృష్ణారెడ్డి కాలేజీకి చెందిన హ‌రిహ‌ర‌న్ (18), హుబేద్ (18), బాలు (18)గా గ‌ల్లంత‌య్యారు. గ‌ల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హ‌రిహ‌ర‌న్, హుబేద్ ల బ‌ర్త్ డే సంద‌ర్భంగా న‌ర‌సింహ స్వామి టెంపుల్ కు విద్యార్థులు వెళ్లారు. ఆ త‌ర్వాత 9మంది విద్యార్థులు చెరువులో ఈత‌కు వెళ్లారు. ముగ్గురు గ‌ల్లంతు కాగా.. ఒక‌రి మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. మిగ‌తా ఇద్ద‌రి మృత‌దేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement