Monday, April 29, 2024

RR: కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదు.. రమేష్ కుమార్

షాద్ నగర్, ఆగస్టు 10, ప్రభన్యూస్ : కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని షాద్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని సీఎస్కే కాలనీలో ఇటీవల పోలీస్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ లో నాంపల్లి చంద్రశేఖర్, భవానీల కుమారుడు సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన నాంపల్లి సాయి వంశీని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

వైశ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం ఎంతో అరుదు అని, పోటీ సమాజంలో కాంపిటీషన్ తట్టుకొని ఉద్యోగాలు సంపాదించడం ఎంతో అభినందనియమన్నారు. ఆర్యవైశ్యులు వ్యాపారాలకు పరిమితం కాకుండా అన్నిరంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పోటీకి నిలబడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త రమేష్, సోమ రాఘవేందర్, ఉప్పల సత్యం, నర్సిని వెంకటేష్, చెరుకుపల్లి సూర్యనారాయణ, చెరుకుపల్లి శ్రీనివాసులు, బండారు వజ్రం, తాటి విజయ్ కుమార్, భానురు రామ్మోహన్, గుడిపల్లి త్రినాధ్ కుమార్, బాదం సుధాకర్, సరాపు వెంకటేష్, గుబ్బ శ్రీనివాసులు, గందె రాజు, దాసరి నర్సింలు, వేముల బాలరాజ్, యామ శ్రీనివాసులు, గుద్దేటి పాండు, గుడిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement