Friday, April 26, 2024

గ్రామాలలో స్వచ్చంద లాక్‌డౌన్‌..

కేశంపేట : గ్రామాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండటంతో ఆయా గ్రామాలలో గ్రామస్థులు స్వచ్చంద లాక్‌డౌన్‌ విధించుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో లాక్‌డౌన్‌ విధించగా అదే బాటలో చౌలపల్లి గ్రామంలో గ్రామ స ర్పంచ్‌ వీరేష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించి స్వచ్చందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రామంలో నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా కిరాణా దుకాణాలను తెరిచిఉంచాలని అనంతరం స్వచ్చందంగా దుకాణాలను మూసి వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మంలంలో రోజు 20 నుండి 30 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్వచ్చంద లాక్‌డౌన్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement