బస్సుల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల కోసం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. బస్సుల లేకపోవడంతో స్కూళ్లు… కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం జరిగేంతవరకు వదిలేది లేదని హెచ్చరించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. చివరికి మొయినాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డి జోక్యం చేసుకోవడంతో విద్యార్థులు శాంతించారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement