Monday, April 29, 2024

RR: కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, ఎంపీటీసీ

కొత్తూరు, అక్టోబర్ 28(ప్రభ న్యూస్) : శాసనసభ ఎన్నికల్లో భాగంగా షాద్ నగర్ నియజకవర్గంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అందులో భాగంగా కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంజర్ల సర్పంచ్ మామిడి వసుంధర, ఎంపీటీసీ దేశాల అంజమ్మ, 8 మంది వార్డు సభ్యులు, 500 మంది ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement