Saturday, May 4, 2024

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌

వికారాబాద్ జిల్లాలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ చేపట్టిన ‘మీ సమస్యలపై నా పోరాటం’ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశత్వంపై ప్రజలు, ఉద్యోగులు విసిగిపోయారన్నారు. జేపీ నడ్డా, అమిత్ షా పిలుపు మేరకు ఇవాళ బీజేపీ ర్యాలీ నిర్వాహిస్తోందన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసిన ల్యాండ్, లిక్కర్, ఇసుక మాఫీ ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణలో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం ప్రభుత్వం జరపకపోవడం సిగ్గుచేటన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పొరడిన చాకలి ఐలమ్మ, కొమరం బీమ్‌ల చరిత్రను ప్రజలకు తెలియ చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాని కూకటి వేళ్లతో పీకి వేయడానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని లక్ష్మణ్ పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement