Wednesday, May 8, 2024

ఫారూఖ్‌న‌గ‌ర్‌ తహసీల్దార్ గా పార్థ సారథి బాధ్యతల స్వీకరణ

షాద్ నగర్ (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ నూతన తహసీల్దార్ గా పార్థసారథి నియమితులయ్యారు. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన ఆయన బదిలీపై ఫారూఖ్నగర్ వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన గోపాల్ కందుకూరుకు బదిలీపై వెళ్లారు. గురువారం సాయంత్రం పార్థసారధికి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకగా, ఇక్కడ పనిచేసిన గోపాల్ కు వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement