Monday, May 20, 2024

మరోసారి మానవత్వం చాటుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి

చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఘటనలో గాయపడ్డ బాధితుడిని తన వాహనంలో దవాఖానకు తరలించి ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈరోజు వరంగల్ లో వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంపీ రంజిత్ రెడ్డి ప్రయాణిస్తుండగా ప్రమాదంలో గాయపడి ఒక వ్యక్తి రక్తం మరకలతో కనబడ్డారు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే తన కారు ఆపి వారి వద్దకు వెళ్ళి ప్రమాదం ఎలా జరిగిందని అరా తీసి.. వెంటనే తన వాహనంలో కర్మన్ ఘాట్ గ్లోబల్ అవేర్ ఆస్పత్రికి పంపించారు. మంచి వైద్యం అందించాలని అక్కడి డాక్టర్లను ఫోన్ ద్వారా ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement