Friday, May 17, 2024

Vikarabad: జింక‌ను చంపి.. పీక్కుతిన్న కుక్క‌లు

వికారాబాద్ టౌన్ : అనంతగిరి అడవి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రహరి (ఫినిషింగ్ )లో ఈరోజు ఉదయం జింకను కుక్కలు వెంబడించి చంపి పీక్కు తిన్నాయి. ఇటీవల ఎండలు ముదురుతున్న కారణంగా అనంతగిరిలోని అడవిలో నీళ్లు లేక మూగ జీవులు జనావాసాల్లోకి వస్తున్నందు వ‌ల్ల‌ వీధికుక్కలు జింకలను అడవిలోని మూగజీవాలను వెంబడించి చంపేస్తున్నాయి. అటవీశాఖ గెస్ట్ హౌస్ చుట్టూ వేసిన కంచ లోపల జింకను చంపేసి కుక్కలు తినడం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. గెస్ట్ హౌస్ లో వాచ్ మెన్ లేదా అటవీశాఖ సిబ్బంది ఎవ‌రో ఒక‌రు ఎప్పటికీ ఉంటారు… కానీ అది గమనించకపోవడంతో అటవీశాఖ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement