Thursday, May 2, 2024

కుక్కల దాడిలో జింక కు గాయాలు

వికారాబాద్ టౌన్ : అనంతగిరి దేవాలయ పుష్కరిణి గుడి దగ్గర బుధవారం రోజు అనంతగిరిలో తిరిగే వీధి కుక్కలు జింకను వెంబడించి పీక్కు తినే ప్రయత్నం చేశాయి. దేవాలయంకు వచ్చిన భక్తులు కొందరు చూసి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు జింకను కుక్కల నుండి రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన వద్దకు చేరుకున్న వారు గాయాలపాలైన జింకను ప్రథమ చికిత్స చేసి అడవిలో వదిలి పెట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement