Tuesday, April 30, 2024

ఇంద్రన్న 21 వ వర్థంతి .. ఘన నివాళులు

చేవెళ్ళ : స్వర్గీయ ఇంద్రన్న విగ్రహాల వద్ద చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి నివాళులు అర్పించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి . కౌకుంట్ల లోని స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద కుమారులు కార్తీక్ రెడ్డి,కళ్యాణ్ రెడ్డి,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన ఇంద్రన్న అభిమానులు ఆయనను స్మరిస్తూ,జోహార్ ఇంద్రన్న అంటూ నివాళులర్పించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలో ని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులర్పించారు.అందరినుండి దూరం అయి 21 ఏళ్ళు కావొస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో తెలంగాణా టైగర్ ఇంద్రన్ననిలిచి ఉన్నారన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి గారి ఆశయ సాధన కు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంద్రన్న కల ..రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతుంది.ఇంద్రన్న అడుగుజాడల్లో నడుస్తూ,ఆయన అధిరోహించిన శాఖల్లో మంత్రిగా కొనసాగుతూ ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్తున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని నాయకులు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement