Sunday, April 28, 2024

48గంట‌ల్లో నా భార్యను క‌నిపెట్టాలి.. లేదంటే సూసైడ్ లొకేషన్..

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తాండూరులో తండ్రీకూతుర్లు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. పోలీసులకు తండ్రీకూతుళ్లు 48 గంటల సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు. మూడు నెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిన తన భార్యను గుర్తించాలంటూ భర్త సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన భార్య అదృశ్యం వెనుక పెద్దల హస్తం ఉందంటూ భర్త ఆరోపించాడు. ఈ క్రమంలోనే అతను కూడా తన కూతుళ్లతో సహా సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన భార్యను 48 గంటల్లోగా కనిపెట్టాలని లేదంటే.. 48 గంటల తర్వాత తమ సూసైడ్ లొకేషన్ షేర్ చేస్తా అంటూ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ఇంటి నుంచి వెళ్లిపోయిన స‌మ‌యంలో భార్య అన్న‌పూర్ణ నోట్ రాసి వెళ్ళింది. అందులో నా భ‌ర్త దేవుడు.. పిల్ల‌లు జాగ్ర‌త్త అని రాసి ఉంది. అయితే అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వదిలిపెట్టారు. సత్యమూర్తి మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య ఆచూకీపై ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయినా ఫ‌లితం లేక‌పోవడంతో భ‌ర్త‌, కూతుళ్లు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. తండ్రీకూతుర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే తండ్రి, కూతుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement