Sunday, May 19, 2024

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..

షాబాద్‌ : గర్భీణులు, బాలింతలు, పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజరాజేశ్వరి అన్నారు. షాబాద్‌ మండల పరిధిలోని చందన్‌వెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భీణులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భీణలు, బాలింతలు, తప్పనిసరిగా ఇద్దరికి సరిపడ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, పాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement