Tuesday, April 30, 2024

కుక్కల దాడిలో జింక మృతి.. వికారాబాద్​ జిల్లాలో ఘటన

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్​ జిల్లాలో కుక్కలు దాడి చేయడంతో జింక చనిపోయింది. ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) జరిగింది. దామగుండం అడవి ప్రాంతంలో కుక్కల దాడిలో జింక చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. దామగుండం అడవి ప్రాంతంలో ఉన్న జింకను కుక్కలు వెంటాడి చంపినట్టు సమాచారం.

ఈ సందర్భంగా దామగుణంలో ఉండే సాధువు సత్యనారాయణ మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని ప్రకృతిని సంరక్షించడంలో పూడూరు గ్రామస్తులు తాము కృషి చేస్తున్నప్పటికీ కుక్కల దాడిలో మూగజీవమైన జింక మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి జింకలను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement