Tuesday, May 21, 2024

టీకా వేయించుకుంటున్న ఎంపీపీ..

తాండూరు : ప్రజలు అందరు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తాండూరు ఎంపీపీ అనితారవీందర్‌గౌడ్‌ అన్నారు. తాండూరు మండలం జినుగుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అనితారవీందర్‌గౌడ్‌ ఎల్మకన్నె మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌ సతీమణి బకులావతి గౌడ్‌తో కలిసి కరోనా టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. ధైర్యంగా వచ్చి టీకాలు వేయించుకోవాలన్నారు. టీకా వేయించుకున్న తరువాత కూడ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలన్నారు. ఆమె వెంట డీసీసీబీ డైరెక్టర్‌, ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement