Tuesday, April 30, 2024

Breaking : కొడంగల్‌లో పదేళ్ల బాలుడి కిడ్నాప్.. దారుణ హత్య

వికారాబాద్‌ జిల్లా కొడంగల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 29న బాలుడు రజాఖాన్‌ని దుండగులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం బాలుడిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని ఎస్టీ హాస్టల్‌ ఎదుట ముళ్లపొదల్లో మృతదేహం పడేసి వెళ్లిపోరారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడు కేకలు వేయడంతో తాము దొరికిపోతామనే భయంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement