Saturday, May 11, 2024

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం : ప్రకటించిన కేసీఅర్

తెలంగాణ రాష్ట్ర స‌మితి జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా బాధ్యతలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాధ్యతలు ఎమ్మెల్సీ శంభీపుర్ రాజులకు అప్పగించారు. వాస్తవానికి జిల్లాల రేసులో వీరి పేర్లు లేవు. ఇతరుల పేర్లు పార్టీ పెద్దలకు పంపించారు. కానీ సీఎం కేసీఅర్ నిర్ణయంతో జాబితా మొత్తం మారిపోయింది. మొత్తమ్మీద‌ చాలా రోజుల తరువాత జిల్లా అధ్యక్షులను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement