Wednesday, May 8, 2024

RR: వైశ్యులంతా ఏకం కావాలి.. గణేష్ గుప్తా

షాద్ నగర్, సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్) : ఆర్యవైశ్యులు ఎప్పుడైతే ఏకమై ఐకమత్యంతో ఉంటారో అప్పుడే సమాజం, రాజకీయ పార్టీలు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆహ్వానించే సమయం వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుగుంట్ల గణేష్ గుప్తా అన్నారు. మంగళవారం స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం కార్బన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల 30వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పిలుపుమేరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయంతో చేయాలని గణేష్ గుప్తా పిలుపునిచ్చారు.


ఆర్యవైశ్యలు చాలా మంది నిరుపేదలు ఉన్నారని, వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు అయితే
ఎంతో మేలు జరుగుతుందన్నారు. షాద్ నగర్ నుండి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement