Saturday, May 4, 2024

వైభవంగా గణనాథుడి శోభాయాత్ర.. మినీ ట్యాంక్ బండ్ లో నిమజ్జనాలు

పెద్దపల్లి : అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఘననాథుడి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం మండపాల నిర్వాహకులు ఉత్తర పూజ చేసి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఆనందోత్సవాల మధ్య శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తున్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చైర్పర్సన్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement