Thursday, May 2, 2024

RR | మొకిల కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలి: సర్పంచుల సంఘం

శంకరపల్లి (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొకిల కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేయాల‌ని స‌ర్పంచుల సంఘం కోరింది. ఆ మున్సిపాలిటీలో త‌మ‌ గ్రామాలను కలపాలని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ అన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పథంలో నడుస్తున్న శంకర్‌ప‌ల్లికి తూర్పువైపు ఉన్న‌ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకుంటూనే.. మున్సిపాలిటీగా రూపాంతరం చేస్తే మ‌రింత అభివృద్ధి చెందుతాయ‌ని అభిల‌షించారు. మొకిల కేంద్రంగా నూతన మున్సిపాలిటీని ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, సబితా రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా స‌మావేశంలో శంకర్‌ల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్‌తో పాటు త‌దిత‌ర స్థానిక నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement