Thursday, May 2, 2024

RR: మద్యం సేవించి ప్రమాదాలు చేస్తే 304 పార్ట్ కేసు..

వికారాబాద్ టౌన్, డిసెంబర్ 31( ప్రభ న్యూస్): డిసెంబర్ 31 జనవరి1 న్యూ ఇయర్ సందర్భంగా యువత డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జారిమాన తో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీను పేర్కొన్నారు.

డిసెంబర్ 31 సందర్భంగా వికారాబాద్ పట్టణ ప్రాంతంలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాత్రి సమయంలో వాహనాల సైరన్లు ఏకతాటిగా మోగిస్తే వారి లైసెన్సులు రద్దు చేసేందుకు చర్య తీసుకుంటామని అదేవిధంగా మద్యం సేవించి ఎవరైనా ప్రమాదాలు జరిపితే 304 పార్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement