Monday, April 29, 2024

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు

యాచారం : యాచారం మండలంతో పాటు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్థులు చేపట్టిన సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతును ఇస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటికరణ చేస్తున్నందుకు దానిని వ్యతిరేకిస్తు సమ్మె చేస్తున్న ఉద్యోగస్థులకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే రైతు చట్టాల ద్వారా రైతులను మోసం చేసి అదే విధంగా విద్యను ప్రైవేటు పరం చేయడం వైద్యాన్ని ప్రైవేటు చేయడం 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తీసి వేయడం కేంద్రం ఆలోచిస్తుందని కావున కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి వీటన్నింటిని విరమించుకోవాలని సిఐటియు డిమాండ్‌ చేస్తుందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు దారుల చేతిలో పెట్టడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆన్‌ లైన్‌ సేవల పేరుతో ఖాతాదారులపై బారాలు మోపి నేడు బ్యాంకులను ప్రైవేటు వాళ్ల చేతిలో పెడుతానని అనడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు బ్యాంకు ఉద్యోగస్థులకు ప్రజలకు సిఐటియు అండగా ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement