Thursday, May 2, 2024

Raja Singh – కారెక్కుతారా… హారీష్ రావుతో రాజా సింగ్ భేటి..

హైద‌రాబాద్ – తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. ఆయ‌న‌తో గంట‌పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు.. ఇది ఇలా ఉంటే రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ చెప్పారు. ఇతర విషయాల గురించి తాము చర్చించలేదని అన్నారు. పార్టీ మార‌తారా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా మోనంగా వెళ్లిపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement