Thursday, May 2, 2024

TS: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పై గవర్నర్ కు రఘునందన్ ఫిర్యాదు

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ వెంకటయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, అతని భార్య సర్పంచ్‌గా కూడా ఉన్నారని తెలిపారు. అయితే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వెంకటయ్య బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని కూడా ప్రచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికార హోదాతో దుర్వినియోగానికి పాల్పడిన వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కోరినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement