Tuesday, May 21, 2024

Protest – రేవంత్ రెడ్డిపై యాద‌వుల ఆగ్ర‌హం – దున్న‌పోతుల‌తో ర్యాలీ..

హైద‌రాబాద్ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు నేడు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ముందుగా ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టిన యాదవ జేఏసీ దున్న‌పోతుల‌తో ర్యాలీగా గాంధీభవన్ కు బయలుదేరారు. ఈ క్రమంలో గొల్లకురుమలను ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంత‌రం యాదవ సంఘాల సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.. కాగా,. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే యాదవుల గాంధీభవన్ ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారిగేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ కూడా అటు వైపుగా రాకుండా చూశారు…

.

Advertisement

తాజా వార్తలు

Advertisement