Wednesday, May 8, 2024

నిర్మల్ లో ప్రైవేట్ బస్సు బోల్తా.. 17 మందికి తీవ్ర గాయాలు

నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొండాపూర్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement