Tuesday, April 30, 2024

Prasadam – అయోధ్య రామునికి భాగ్య‌న‌గ‌రం నుంచి భారీ లడ్డు…

సికింద్రాబాద్ – అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన నుంచి ప్రేమ ప్రతిష్టాపన చేసిన వరకు ఎన్ని రోజులు(1265) పట్టిందో అన్ని కేజీల లడ్డూను తయారు చేసినట్లు శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం తెలిపారు. ఈ భారీ లడ్డూను భారీ వాహ‌నంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్య కు ఈ రోజు తరలిస్తున్నారు. ఈ యాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో ప్రారంభించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement