Friday, May 10, 2024

Khammam – గంప‌గుత్త‌గా ఎమ్మెల్యేల‌ను కొనే కెసిఆర్ ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడ‌ట‌మా – ఎద్దేవా చేసిన పొంగులేటి

ఖ‌మ్మం – తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలేరులో అనవసర‌ విమర్శలు చేశారని మండిపడ్డారు. తన పేరు ప్రస్తావించకుండా తనని టార్గెట్ చేసి మాట్లాడరని అన్నారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ,. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం, నోట్ల కట్టల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

కేసీఆర్ పక్కన కూర్చొన్నోళ్లు ఏ పార్టీ నుంచి గెలిచారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తాను కాంట్రాక్టులు చేసి, పైరవీలు చేసి డబ్బు సంపాదించానని కేసీఆర్ మాట్లాడరని.. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. తాను తడి బట్టలతో వస్తానని.. ఏ గుడికి ఎప్పుడు వస్తారో రండి అని సవాలు విసిరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement