Friday, May 17, 2024

Politics: కేసీఆర్ ఓ సంచ‌ల‌నం.. పార్టీ చీఫ్‌గా ప‌దోసారి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌..

టీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నేడు జ‌ర‌గ‌నున్న‌ పార్టీ ప్లీనరీలో అధికారికంగా ప్రకటించనున్నారు. 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షుడిగా 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది.

ఆ తర్వాత వరుసగా జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వ‌స్తున్నారు. నేడు జరగనున్న ప్లీనరీ పదోది కాగా, ఈసారి కూడా పార్టీ నేతలు ఆయననే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా సుదీర్ఘకాలంపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారి జాబితాలో కేసీఆర్ కూడా చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement