Monday, May 6, 2024

పేప‌ర్ లీకేజ్ – బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల‌కు నోటీస్..

వ‌రంగ‌ల్ – టెన్త్ క్లాస్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ కేసులో బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. వరంగ‌ల్ లోని డిసిపి కార్యాల‌యంలో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు హాజ‌రుకావాల‌ని ఆ నోటీస్ లో కోరారు..సిఆర్ పి సి 160 ప్ర‌కారం ఈ కేసులో సాక్షిగా హాజ‌రుకావాల‌ని ఆ నోటీస్ లో పేర్కొన్నారు.. కాగా,పోలీసుల ఇచ్చిన నోటీస్ పై ఈట‌ల న్యాయ‌నిపుణుల స‌ల‌హా తీసుకోనున్నారు.. ఆనంత‌రం ఆయ‌న డిసిపి కార్యాల‌యానికి వెళ్లాలా వ‌ద్దా అనేది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.. ఇక ఈ నోటీస్ పై ఈట‌ల స్పందిస్తూ, త‌న‌కు ఫోన్ వస్తే మాట్లాడ‌ట‌మే తెలుస‌ని, వాట్స ప్ వాడ‌టం రాద‌ని పేర్కొన్నారు.. ఇంత వ‌ర‌కు వాట్స ప్ లో ఆ ప్ర‌శ్నాప‌త్రం తాను చూడ‌లేద‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement