Tuesday, May 14, 2024

రద్దీ ప్రదేశాల్లో పోలీసుల తనిఖీలు.. అనుమానిత వ్యక్తుల వివరాల సేకరణ

పెద్దపల్లి (ప్రభా న్యూస్) రద్దీ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం రాత్రి పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ తో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు లు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించామన్నారు.

బస్టాండ్ రైల్వేస్టేషన్లలో అనుమానిత వ్యక్తులు సంచరించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం వాహనాల తనిఖీలు చేపట్టి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసు నమోదు చేసి జరిమానాలు విధించారు. తనిఖీల్లో పెద్దపల్లి సిఐ ప్రదీప్కుమార్ ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్, మౌనిక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement