Thursday, May 2, 2024

గుట్కాపై పోలీసుల ఉక్కుపాదం.. రూ.14.76 లక్షల విలువైన గుట్కా స్వాధీనం..

మునిపల్లి, ప్రభన్యూస్‌: సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుదేరా ఎక్స్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కంకోల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఎస్‌ఐ చెల్లారాజ్‌ శేఖర్‌ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. జహీరాబాద్‌ వైపు నుండి హైదరాబాద్‌ వైపు వస్తున్న రెండు టాటా ఏసీ వాహనాల్లో భారీగా గుట్కాను తరలిస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో భారీగా గుట్కా లభ్యమైంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

మొత్తం 84 సంచులలో గుట్కాను తరలించేందుకు ప్రయత్నం చేశారు. వాటి విలువ సుమారు రూ.14.76లక్షలు ఉంటు-ందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులను, వాహనాలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement