Saturday, May 4, 2024

రెమిడిసివిర్ దందాలో బీజేపీ నేతలు

కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా, కొందరు మానత్వం మరిచి రాక్షాసుల్లా వ్యవహరిస్తున్నారు. కరోనా రోగులను ప్రాణాల నుంచి కాపాడేందుకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరతగా సృష్టించి బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేస్తున్నారు. సూర్యాపేట కేంద్రంగా రెమిడిసివిర్ దందా సాగిస్తోన్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. కరోనా రోగుల అవసరాలను క్యాష్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ.3,500 విలువ గల ఇంజక్షన్ ను బ్లాక్ లో రూ.35 వేలకు విక్రయిస్తున్న  12 మంది సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దందాలో ఇద్దరు బీజేపీ నేతలే కీలక నిందితులు ఉన్నారు. ఏ1 మాధవరెడ్డి, ఏ2 కార్తిక్ రెడ్డి పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement