Monday, April 29, 2024

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. నర్సులపై ఖాకీ జులుం

హైదరాబాద్ గాంధీ భవన్​ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్​ నుంచి కోఠి డీఎంఈ కార్యాలయం వరకు నర్సులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు నర్సులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో 20 మంది నర్సులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిని నారాయణగూడ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు గాయాలయ్యాయి. ఓ నర్సుకు కడుపులో దెబ్బ తగిలింది. ఈ తోపులాటలో స్టాఫ్‌ నర్స్ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళలపై పోలీసుల తీరును మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు తీవ్రంగా ఖండించారు. విధుల నుంచి తొలగించిన నర్సులను వెంటనే తీసుకోవాలని సునితారావు డిమాండ్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement