Monday, May 6, 2024

ఏపీలో కొత్తగా 3,040 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,00,103 సాంపిల్స్ ని పరీక్షించగా 3,040 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో నలుగురు, చిత్తూర్ లో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం మరియు పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే గడచిన 24 గంటల్లో 4,576 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…1917253
యాక్టీవ్ కేసుల సంఖ్య….30300
డిశ్చార్జ్ కేసుల సంఖ్య…1873993
మొత్తం మరణాల సంఖ్య…12960

Advertisement

తాజా వార్తలు

Advertisement