Saturday, May 4, 2024

TS : ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న పీఎం మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకొనున్నారు ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.

- Advertisement -

మొన్న బెంగళూర్ పేలుళ్ల ఘటన దృష్ట్యా హైదరాబాద్‌లో మోదీ పర్యటనలో పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గాల్లో దారి మల్లింపు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచించారు. ఈ డైవెర్షన్లతో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement