Monday, April 29, 2024

Metro : ప్ర‌ధాని మోదీ మీటింగ్‌… మెట్రో బంద్

హైదరాబాద్‌లో ప్ర‌ధాని మోదీ రోడ్‌షోలు ఉన్నందున్న మెట్రో సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలనుంచి 6.30 వరకూ రెండు గంటల సేపు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మోడీ సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో రోడ్ షో లో పాల్గొంటారు. ముషీరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్ పురా, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి తదితర ప్రాంతాలలో ప్రధాని రోడ్ షో జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement