Thursday, May 9, 2024

Peddapalli – బిఆర్ఎస్ మ్యాని ఫెస్టో తో ప్రతిపక్షాలు షాక్ – ..ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రతిపక్షాకు షాక్ లో వున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణ లో రాగినేడు గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర అంజయ్య తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పుచ్చుకున్నారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరోసారి రైతు, మహిళ, నిరుపేదల పక్షపాతి అని నిరూపణ అయిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు ద్వారా ప్రతి ఏటా ఎకరానికి 16 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. మహిళలకు మూడు వేల రూపాయలు ప్రతినెల అందిస్తామని, తెల్ల కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతోపాటు రైతు బీమా తరహాలో బీమా వర్తింప చేస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గ్రామాల్లో మీ ఇండ్ల ముందు మీ కళ్ళముందే కనబడుతుందనన్నారు. సీఎం కేసీఆర్ మాటలతో కాకుండా చేతలతో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నికల సీజన్లో వచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కనబడరని, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీ కష్టసుఖాలలో వెన్నంటి ఉంటారన్నారు. వారంటీ లేని 6 గ్యారంటీల పత్రాలతో వచ్చేవారిని నమ్మి మోసపోవద్దన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి అభివృద్ధి పథంలో నడిపించే మహానుభావుడు సీఎం కెసిఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే మన కర్తవ్యం అన్నారు.

పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు పలు పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, సర్పంచ్ మల్క రేవతి కుమారస్వామి లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement