Sunday, April 28, 2024

Peddapalli – కారు జోరు.. కాంగ్రెస్ బేజారు – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) నియోజకవర్గంలో కారు జోరుకు కాంగ్రెస్ పార్టీ బేజార్ అవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శనివారం ఓదెల మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ లు బియ్యాల ఐలయ్య, తీగల సదానందం, ముద్దసాని చేరాలు, ఎంబడి పోచాలు,ముద్దసాని రాజయ్య, దిడ్డిగి శంకరయ్య, రాందేని తిరుపతి, రాందేని స్వామి, రాందేని శ్రీనివాస్, రాందేని కొంరయ్య, రాందేని రమేష్, దొంగరి రాకేష్, రాందేని శ్రీనివాస్ లు గులాబీ పార్టీలో చేరగా ఎమ్మెల్యే దాసరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, సంక్షేమమైనా అభివృద్ధి చేయడం అయినా బిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో ఏలా అమలు చేస్తారన్నారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందడంతో పాటు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 అందుతాయని, ఆసరా పింఛన్లను ఐదువేలకు పెంచుతామని వికలాంగుల పింఛన్లను ఆరువేల రూపాయలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే అందిస్తామని రైతు బందును 16 వేల రూపాయలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మూడు గంటలు కరెంటు వస్తుందని కారు గుర్తుకు ఓటేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండా రెపరెపలాడేలా సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచ్ తీర్తాల కుమారస్వామి,కన్వీనర్ కనికిరెడ్డి సతీష్,మాజీ ఎంపీపీ బుద్దె రామస్వామి,గ్రామ శాఖ అధ్యక్షులు పోలోజు రమేష్,రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ బోడకుంట మహేందర్,మార్కెట్ డైరెక్టర్ బుద్దె కుమారస్వామి, మాజీ డైరెక్టర్ బోడకుంట నరేష్, పెరుక సంఘం అధ్యక్షులు గోపతి ఎల్లయ్య, ఉపాధ్యక్షులు రాందేని స్వామి, మాజీ మండల కో ఆప్షన్ సర్వర్ ,ప్రధాన కార్యదర్శి చింతం మోగిలి ,పడాల మల్లయ్య,కనికి రెడ్డి సురేష్,నాగపురి పైడి,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement