Wednesday, May 1, 2024

Peddapalli – మూడోసారి భంగపాటే… ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మూడోసారి భంగపాటు తప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఓదెల మండలం పొత్కపల్లి లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లి లో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవన్నారు.

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, కెసిఆర్ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే వెంట భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement