Saturday, May 18, 2024

కరోనా బారిన పడిన పీసీసీ అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సేకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఉపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement