Monday, April 29, 2024

ఏపీలో తగ్గని కరోనా..కొత్తగా 11 వేల కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు ఉండగా, కరోనా వైరస్‌తో 37 మంది మరణించారు. రాష్ట్రంలో 10,20,926కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్‌తో 7,616 మంది మరణించారు. రాష్ట్రంలో 81,471 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,31,839 మంది రికవరీ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరినట్లు

ఇక కరోనాతో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున; అనంతపురం, చిత్తూరులో నలుగురేసి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ముగ్గురు చొప్పున; గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement