Sunday, April 28, 2024

HYD : సొంత గూటికి చేరిన బిజెపి దళిత నాయకుడు పాశం శ్రీశైలం

కర్మన్ ఘాట్, నవంబర్ 14 (ప్రభ న్యూస్) బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు బిజెపి వెంటనే ఉంటారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి దళిత నాయకుడు పాశం శ్రీశైలం కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సమక్షంలో తిరిగి బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో బిజెపి గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి, సుంకరి రమేష్ గౌడ్, లింగాల దశరథ్ గౌడ్, అవినాష్ రెడ్డి, గాజుల శేఖర్, సామ నర్సింహారెడ్డి, రాంపురం శ్రీను, సిల్వర్ కళ్యాణ్, శ్రీధర్ గౌడ్, సుమిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement