Friday, May 10, 2024

Nzb: పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి… కిషన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, జులై 12 (ప్రభ న్యూస్) : రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచించారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి ని, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణని, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ని, శాసనసభ్యులు మాధవనైన రఘునందన్ రావుని, రాష్ట్ర ప్రధాన అధికారులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మర్యాద పూ ర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా దన్ పాల్ మాట్లాడుతూ… బూతు స్థాయి వరకు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ధన్ పాల్ అన్నారు. ధన్ పాల్ తో పాటు అర్బన్ నియోజకవర్గ నాయకులు పోత్తంకర్ లక్ష్మీనారాయణ, పంచారెడ్డి లింగం, నాగోల్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, గోపిడి వినోద్ రెడ్డి,బంటు రాము, శ్రీధర్, బురుగుల వినోద్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, రోషన్ లాల్ బోర సీనియర్ నాయకులు కుమార్, కార్పొరేటర్లు మట్టం పవన్, బట్టి కార్ ఆనంద్, ఆశిష్ విజయ్, భాస్కర్ రెడ్డి, బిర్జు మోహన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement