Friday, May 3, 2024

TS: పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఓవైసీ వ్యాఖ్యలు.. బండి సంజయ్

అయోధ్యలో ఈనెల 22న అంగరంగ వైభవంగా జరగబోయే రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగానే 500 ఏళ్లపాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా ? అంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.

శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా ఈనెల 22న అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని కోరారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు సైతం రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన దాఖలాల్లేవు. రాజకీయాలకు అతీతంగా రామ మందిర నిర్మాణం కోసం దేశంలోని ప్రతి ఒక్క హిందువు తమ వంతు సాయం చేసి అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నారన్నారు. ఈనెల 22న జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ఓవైసీ ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement