Saturday, May 4, 2024

Gudihathinur : విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

గుడిహత్నూర్, ప్రభ న్యూస్ : గుడిహత్నూర్ మండలంలోని కోలారి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ గా పనిచేస్తున్న దత్తు శుక్రవారం విద్యుత్ స్తంభం పైకి ఎక్కి బల్బులు భిగిస్తుండగా విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని గ్రామస్తులు అన్నారు. ఎల్ సి తీసుకున్నా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు, దీనికి బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement