Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్​​ పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడుతున్న కొంతమందిపై ​ పోలీసులకు ఫిర్యాదు అందింది. “ఛలో ఢిల్లీ” అనే ఫేక్ ఐడీతో రెచ్చిపోతున్నఓ నెటిజన్​పై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరవై ఏండ్ల కలను సాకారం చేసి.. ఎనిమిదేళ్లుగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ యావత్ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా పరిపాలిస్తున్న దేశ్ కా నేత కేసీఆర్ గురించి ఎవరైన అసభ్యకరమైన పోస్టులు పెడితే ఊరుకోబోమని దినేష్​ హెచ్చరించారు.

అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలోని లోపాలను, కేసీఆర్ పాలనపై సబ్జెక్టు ఫరంగా చర్చ చేయాలి కానీ, మనోభావాలను కించపరిచేలా.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై అగౌరవంగా పోస్టులు పెడితే చట్టఫరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ అధికారులు త్వరలోనే ఆ నెటిజన్ వివరాలను సేకరించి చట్టఫరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని దినేష్ చౌదరి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement